మహిళల అభ్యున్నతే మోదీ లక్ష్యం : పీవీ శ్యాంసుందర్​రావు

మహిళల అభ్యున్నతే మోదీ లక్ష్యం : పీవీ  శ్యాంసుందర్​రావు

యాదాద్రి, వెలుగు: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ  శ్యాంసుందర్​రావు చెప్పారు.  వలిగొండ మండలం గోకారం, తుర్కపల్లిలో పీఆర్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం గిఫ్ట్​లు అందించి మాట్లాడారు. మహిళలు  పారిశ్రామిక రంగంలో  రాణించేందుకు ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పిస్తున్నారని గుర్తుచేశారు.  

ఉజ్వల గ్యాస్, సుకన్య సమృద్ధి యోజన, ఆయుష్మాన్ భారత్, బేటి బచావో - బేటి పడావో, విశ్వకర్మ యోజన, పీఎం కిసాన్  నిధి, ముద్ర లోన్స్​పథకాలతో అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుర్కపల్లి మాధవి, ఉప సర్పంచ్​ మైసొళ్ల మత్స్యగిరి, ఎంపీపీ నూతి రమేష్, బీజేపీ లీడర్లు ఏలె చంద్రశేఖర్​, నాగెల్లి సుధాకర్ గౌడ్, పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, సీఎన్​ రెడ్డి, తుమ్మల యుగెందర్ రెడ్డి, పిట్టల అశోక్, రాచకొండ కృష్ణ, ఏలూరి శ్యామ్, అనిల్ కుమార్, వెలిమినేటి వెంకటేశ్, డోగిపర్తి సంతోష్ ఉన్నారు.