సింగపూర్ ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు..

సింగపూర్ ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు..

సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో పీవీ సింధు శివంగిలా దూసుకుపోతుంది. సెమీస్లో జపాన్ ప్లేయర్ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్లో జపాన్ క్రీడాకారిణి సయీనా కవకమినిని 21-15,21-7 స్కోరు తేడాతో మట్టికరిపించి టైటిల్ బరిలోకి నిలిచింది. 

అరగంటలో ఖతం..
కేవలం అరగంటలో ముగిసిన మ్యాచ్లో పీవీ సింధు ప్రత్యర్థిపై  పూర్తి ఆధిపత్యం ప్రద్శరించింది. ఫస్ట్ సెట్లో  సయీనా కాస్త ప్రతిఘటించినప్పటికీ..సింధుపై  మాత్రం పైచేయి సాధించలేకపోయింది. ఇక సింధు మాత్రం అద్భుతమైన స్మాష్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. 21-15తో తొలి సెట్ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో సయీనా పూర్తిగా చేతులెత్తేసింది. సింధుజోరుకు నిలవలేక..వేగాన్ని తట్టుకోలేక..7-21తో గేమ్ను మ్యాచను అప్పగించింది. 

ఫ్యాన్స్ ఖుష్..
థాయిలాండ్ ఓపెన్  సెమీస్ తర్వాత  తరువాత పీవీ సింధు మళ్లీ అలాంటి రికార్డును నెలకొల్పడం విశేషం. ప్రస్తుతం ఫైనల్లోకి ప్రవేశించిన సింధు..టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు జులై 28 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్న నేపథ్యంలో పీవీ సింధు  ఫామ్‌లోకి రావడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోరును కొనసాగించి సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్ను సొంతం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.