థాయిలాండ్ ఓపెన్ రెండో రౌండ్లోకి పీవీ సింధు

థాయిలాండ్ ఓపెన్ రెండో రౌండ్లోకి పీవీ సింధు

థాయిలాండ్ ఓపెన్లో పీవీ సింధు రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. ఉమెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో ఆమె అమెరికాకు చెందిన లారెన్ లామ్పై 21-18,19-21,21-18 స్కోరు తేడాతో విజయం సాధించింది. 59 నిమిషాల పాటు హోరా హోరీగా సాగిన మ్యాచ్లో మొదటి గేమ్ను సింధు 21-19 స్కోరుతో గెలవగా..రెండో గేమ్ లో ప్రత్యర్థి పుంజుకుంది. అద్భుతమైన స్మాష్లతో సింధు నుంచి గేమ్ను లాగేసుకుంది. ఇక డిసైడర్ గేమ్లో సింధు తన అనుభవాన్నంత ఉపయోగించింది. పదునైన షాట్లు, అద్భుతమైన స్మాష్లతో ప్రత్యర్థిపై 21-18 స్కోరు తేడాతో గేమ్ను గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఇక రెండో రౌండ్లో సింధు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్లేయర్ 
సిమ్ యు జిన్తో తలపడనుంది. 

మరిన్ని వార్తల కోసం

కాంస్య పతకం సాధించిన బాక్సర్ మనీషా మౌన్

బినోయ్ విశ్వం అరెస్టుపై చాడ వెంకట్రెడ్డి ఫైర్

థాయిలాండ్ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు