టోక్యో ఒలింపిక్స్ సెమీస్ లో పీవీ సింధు ఓటమి

టోక్యో ఒలింపిక్స్ సెమీస్ లో పీవీ సింధు ఓటమి

టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు అమ్మాయి పీవీ సింధు సెమీస్ పోరాటం ముగిసింది. వరల్డ్ నెంబర్ 1, చైనీస్ తైపీ ప్లేయర్ తై- జు-యింగ్ చేతిలో సింధు ఓడిపోయింది. ఆటలో మొదటి నుంచి సింధూపై ఆధిపత్యం ప్రదర్శించింది చైనీస్ తైపీ ప్లేయర్ తై- జు-యింగ్. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక పోయింది సింధు. దీంతో 21/18,21/12 తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కు గోల్డ్ మెడల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక కాంస్య పతకం కోసం రేపు(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు సింధు..చైనా ప్లేయర్  హి బింగ్జియావోతో తలపడనుంది.