పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలి: జనగామ కలెక్టర్ సందీప్‌‌కుమార్‌‌‌‌ ఝా

పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలి: జనగామ కలెక్టర్ సందీప్‌‌కుమార్‌‌‌‌ ఝా

జనగామ, వెలుగు: టీచర్లు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి మంచిగా చదువు చెప్పాలని జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా సూచించారు. వారికి నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో బడిబాటలో ఎంతమంది స్టూడెంట్స్​ప్రభుత్వ స్కూళ్లలో చేరారని, ఇంకెందరిని చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. 

దీంతో 9 వేల మందిని చేరుస్తామని ఎంఈవోలు తెలిపారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్‌‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు ఇవన్నీ అందేలా టీచర్లు బాధ్యతగా వ్యవహారించాలన్నారు. మీటింగ్‌‌లో ఎడ్యుకేషన్​ఇన్‌‌చార్జ్‌‌​ఏడీ శ్రీనివాస్, జీసీడీవో గౌసియా, ఎంఈవోలు ఉన్నారు. 

రీ టెండర్​ నోటిఫికేషన్​ 

జిల్లాలోని కేజీబీవీలు, హాస్టల్స్‌‌కు నిత్యావసర వస్తువుల సరఫరా కోసం కలెక్టర్, ఇన్‌‌చార్జ్​ డీఈవో సందీప్​కుమార్ ఝా రీ టెండర్​ నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరంలో కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ సరఫరా కోసం నియోజకవర్గాల వారీగా నోటిఫికేషన్​ రిలీజ్​ చేశారు. పూర్తి వివరాలకు డీఈవో ఆఫీస్‌‌లో సంప్రదించాలని సూచించారు.