స్టూడెంట్లకు లాప్​ట్యాప్స్​ ఇచ్చిన క్వాలిజీల్​ సంస్థ

స్టూడెంట్లకు లాప్​ట్యాప్స్​ ఇచ్చిన క్వాలిజీల్​ సంస్థ

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ అయిన క్వాలిజీల్, తమ కార్పొరేట్​ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమం "డిజిటల్ యాక్సెస్"లో భాగంగా హైదరాబాద్​లో పేద స్టూడెంట్లకు లాప్​ట్యాప్​లను అందజేసింది. ఈ కార్యక్రమం కోసం నిర్మాణ్​ అనే ఎన్జీఓతో చేతులు కలిపింది. 

డిజిటల్ అంతరాన్ని తగ్గించడం విద్య, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా డిజిటల్​యాక్సెస్​ కార్యక్రమాన్ని చేపట్టామని కంపెనీ తెలిపింది.  "డిజిటల్ యాక్సెస్" కార్యక్రమం కింద తెలుగు రాష్ట్రాల్లో క్వాలిజీల్,  నిర్మాణ్​తో కలిసి డిజిటల్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయడం, కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం  డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేపట్టింది.