రాంరెడ్డి దామోదర్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ రెండో స్థానం కోసమే కొట్లాడుతున్నాయని మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం మండలం నుంచి చౌటుప్పల్ వరకు 15 కిలోమీటర్లు ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు ఓట్లడిగేందుకు వస్తే.. రుణమాఫీ, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డులపై నిలదీయాలని దామోదర్రెడ్డి పిలుపునిచ్చారు.