
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్చేశారు. శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో స్టేట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆయనతోపాటు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, సుధీర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. తొలగించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. వారికి ఉద్యోగ భద్రతతోపాటు ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.