
డ్యూసెల్డార్ఫ్( జర్మనీ): చెస్ వరల్డ్ కప్లో టైటిల్ మిస్సయిన ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫిడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ చాంపియన్షిప్ తొలి ఎడిషన్లో గోల్డ్ అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో ప్రజ్ఞానందతో కూడిన డబ్ల్యూఆర్ చెస్ జట్టు విజేతగా నిలిచింది. విశ్వనాథన్ ఆనంద్ బరిలో నిలిచిన ఫ్రీడమ్ టీమ్ రెండో ప్లేస్తో సిల్వర్ గెలిచింది. తెలంగాణ జీఎం ఎరిగైసి అర్జున్, హారిక, పి. హరికృష్ణ, నిహాల్ సరిన్లతో కూడిన టీమ్ ఎండీజీ1 బ్రాంజ్ నెగ్గింది.