అడ్డగుడూరు లాకప్ డెత్ .. ముగ్గురు అధికారులు సస్పెండ్

అడ్డగుడూరు లాకప్ డెత్ .. ముగ్గురు అధికారులు సస్పెండ్

యాదాద్రి భూవనగిరి జిల్లా అడ్డగుడూరు లాకప్ డెత్ లో పోలీసులపై చర్యలు తీసుకున్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ . ముగ్గురు అధికారులపై వేటు వేశారు. అడ్డగూడూరు ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యను సస్పెండ్ చేశారు. అడ్డగూడూరు పీఎస్ లో మూడు రోజుల క్రితం మరియమ్మ అనే దళిత  మహిళ మృతి చెందింది.. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా లాకప్ డెత్ లో ఎస్సై,ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఎస్సై , ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీపీ భగవత్