బిహార్ లో మండీలు మూసివేసి మద్దతు ధర దక్కకుండా చేశారు

బిహార్ లో మండీలు మూసివేసి మద్దతు ధర దక్కకుండా చేశారు

రైతులను దెబ్బకొట్టేందుకు మోడీ ప్రభుత్వం మూడు చట్టాలు తీసుకువచ్చిందన్నారు రాహుల్ గాంధీ. మొదటగా బిహార్ లో మండీలు మూసివేసి మద్దతు ధర దక్కకుండా చేశారన్నారు. ఇదే విధానాన్ని ఇప్పుడు దేశమంతా అమలు చేస్తున్నారని ఆరోపించారు. మోడీ ఎక్కడికి వెళ్లిన చెప్పేది అబద్ధాలేనన్నారు రాహుల్.

RJD లీడర్ తేజస్వి యాదవ్ తో కలిసి నవాడా జిల్లా హిసువాలో నిర్వహించిన బద్లావ్ సంకల్ప్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. బిహార్ ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దని మోడీకి సూచించారు రాహుల్. గత ఎన్నికల్లో బిహారీలకు మోడీ 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చారని గుర్తు చేసిన రాహుల్…ఇప్పటివరకూ ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదన్నారు. మోడీ కేవలం అదానీ,అంబానీలకు మాత్రమే పని చేస్తారని ఆరోపించారు.