
న్యూఢిల్లీ: కోవిడ్ 19 ను మోడీ సరిగా అర్థం చేసుకోలేకపోయారన్నారు కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ లో మరణాల రేటు అబద్ధమని..ప్రభుత్వం వీటిపై ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనాపై మేం పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరించామని.. తర్వాత కరోనాపై విజయాన్ని ప్రధాని వ్యక్తం చేశారన్నారు. ఇది వ్యాప్తి చెందుతోన్న వ్యాధి అని.. లాక్ డౌన్ తో ఏంలాభం లేదన్న రాహుల.. మాస్క్ లు ధరించడం, లాక్ డౌన్ తాత్కాలిక పరిష్కారమే అన్నారు. సెకండ్ వేవ్ వెనక ఉన్నది ప్రధాని మోడీ జిమ్మిక్కు అని.. వ్యాక్సిన ఒక్కటే శాశ్వాత పరిష్కారమని తెలిపారు రాహుల్ గాంధీ.