మోదీకి దమ్ముంటే .. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడాలి: రాహుల్ గాంధీ

మోదీకి దమ్ముంటే .. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై  మాట్లాడాలి: రాహుల్ గాంధీ

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ  విమర్శలు చేశారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.  మోదీ ఎన్డీయే వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోదీకి దమ్ముంటే దేశంలో పెరిగిన నిరుద్యోగం ,ద్రవ్యోల్బణంపై మాట్లాడాలని సవాల్ విసిరారు.

 బీజేపీ డైవర్ల్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ప్రదాని మోదీకి రైతులు,పేదల కష్టాలు కనిపించడం లేదని ఫైర్ అయ్యారు.  రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్న రాహుల్ .. ఎన్డీయే వైఫల్యాలను జాతీయ, ప్రాంతీయ మీడియా ప్రసారం చేయడం లేదని చెప్పారు రాహుల్.