సీఎం గెహ్లాట్ సొంతగడ్డ జోధ్పూర్లో భారీ సభ
జోధ్పూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా విమర్శించారు. ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్మర్డర్తో పాటు కరౌలీలో జరిగిన హింసాకాండపై ఆయన విరుచుకుపడ్డారు. దసరా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ బూత్ లెవల్ వర్కర్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పార్లమెంట్లో రాహుల్ చేసిన ప్రసంగాన్ని మరోసారి గుర్తు చేస్తాను. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే రాహుల్ బాబాతో పాటు ఇతర కాంగ్రెస్ నేతల పని. ఇండియా దేశం కాదని ఎవరు చెప్పారు..? ఏ బుక్లో చదివారు..? ఇండియా దేశం కాదన్న రాహుల్.. రూ.41వేలు విలువైన ఫారిన్ టీ షర్ట్స్ వేసుకుని భారత్ జోడో యాత్ర చేస్తున్నడు. ముందు ఇండియా హిస్టరీ గురించి తెలుసుకో”అంటూ షా విమర్శించారు.
తనోట్ మాతా టెంపుల్లో ప్రత్యేక పూజలు
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సొంతగడ్డ జోధ్పూర్ నుంచి అమిత్షా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శుక్రవారం జోధ్పూర్ చేరుకున్న అమిత్షాకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పునియా, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మాజీ సీఎం వసుంధర రాజే, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్వాగతం పలికారు. 1,500 మంది కార్యకర్తలు భారీ మోటర్ సైకిల్ ర్యాలీ తీశారు. జోధ్పూర్లో టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్కు భూమి పూజ చేశారు. తర్వాత జైసల్మేర్లోని తనోట్ రాయ్ మాతా టెంపుల్వెళ్లారు. ‘విజయ్ స్తంభ్’కు పూలమాల వేసి నివాళులర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి... టెంపుల్ ఆవరణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత దబ్లాలోని సౌత్ సెక్టార్ హెడ్క్వార్టర్స్లో బీఎస్ఎఫ్ జవాన్లతో అమిత్షా సమావేశం అయ్యారు. జోధ్పూర్లో నేషనల్ లెవల్ బీజేపీ ఓబీసీ మోర్చా మీటింగ్కు అమిత్షా హాజరయ్యారు.