
రాజౌరి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో పేరెంట్స్ను కోల్పోయిన పిల్లలను ఆయన దత్తత తీసుకోనున్నారు.
సొంత ఖర్చులతో వారిని గ్రాడ్యుయేషన్ వరకు చదివించనున్నారు. ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తారిక్ హమీద్ కర్రా తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ షెల్లింగ్లో కొంతమంది పౌరులు చనిపోయారని, దీంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారని తారిక్ తెలిపారు.