
సికింద్రాబాద్,వెలుగు : రైలులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన ప్రకారం..బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బాలిక(15) చిత్తూరు నుంచి -కాచిగూడకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్రైలులో ఎస్-3 బోగీలో ప్రయాణిస్తుంది. అదే బోగీలో రామంతాపూర్లో ఉండే ఏపీలోని కోడూరు పీఎస్ లో హోం గార్డు ప్రతాప్(43) వస్తున్నాడు. అర్ధరాత్రి బాలిక పడుకోగా బెర్త్పక్కనే నిలబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే బాలిక లేచి తన పేరెంట్స్ కు చెప్పగా.. కాచిగూడ రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేశారు. హోంగార్డు ప్రతాప్ను అదుపులోకి తీసుకుని విచారించగా రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ఎల్లప్ప తెలిపారు.