దీపావళి కానుకగా రైల్వేలో కొలువుల జాతర.. 2570 పోస్టులు.. లేట్ చేయకుండా అప్లయ్ చేసుకోండి..

దీపావళి కానుకగా రైల్వేలో కొలువుల జాతర.. 2570 పోస్టులు.. లేట్ చేయకుండా అప్లయ్ చేసుకోండి..

భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు(ఆర్ఆర్​బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. 

పోస్టులు: దేశంలోని అన్ని ఆర్ఆర్​బీల్లో కలిపి 2570 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ)లో జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.  

వయోపరిమితి: 18 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 31.  

లాస్ట్ డేట్: నవంబర్ 30. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్: రెండు అంచెల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు rrbguwahati.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.