
హైదరాబాద్, వెలుగు: డిజిటలైజేషన్లో భాగంగా రైల్వేశాఖ పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్రిజర్వుడు టికెట్ల కోసం ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడకుండా ఏటీవీఎం(ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్)లను అందుబాటులోకి తెచ్చింది. వాటికి సంబంధించిన స్మార్ట్ కార్డును రిచార్జ్ చేసుకోవడానికి ప్రతిసారి బుకింగ్కౌంటర్లకు రావాల్సి వచ్చేది. ఇకపై www.utsonmobile.indianrail.gov.in లో యూటీఎస్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో స్మార్ట్కార్డులు రీచార్జ్ చేసుకోవచ్చు. డెబిట్కార్డులు, ఇంటర్నెట్ బ్యాకింగ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఫస్ట్ టైం స్మార్టు కార్డు పొందడానికి అడ్రస్ ప్రూఫ్, ఇతర వివరాలను అందజేయాలి. తర్వాత టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్ కార్డు రీచార్జ్చేసుకోవాలి. ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్య కోరారు.