న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలు, ఆఫీసుల భవనానికి ప్రస్తుతం ఉన్న ‘రాజ్ భవన్’ పేరును కేంద్ర ప్రభుత్వం ‘లోక్ భవన్’గా మార్చింది. ఇకపై అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ ఆఫీసుల భవనాలకు ఈ మేరకు పేరును మార్చాలని ఇటీవల కేంద్ర హోం శాఖ లేఖలు రాయగా.. గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాలు ‘లోక్ భవన్’గా పేరును మారుస్తూ ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్చేసింది. కాగా, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) పేరును కూడా కేంద్ర ప్రభుత్వం ‘సేవాతీర్థ్’గా మార్చింది. దశాబ్దాలుగా సౌత్ బ్లాక్ లోని పీఎంవో నుంచి ప్రైమ్ మినిస్టర్లు పని చేస్తున్నారు. ఇప్పుడు పీఎంవో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్ సముదాయంలోని భవనంలోకి మారనున్న నేపథ్యంలో పీఎంవో పేరును కూడా మారుస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
