ధోనీ దోసౌ పార్టీ ఫెయిల్​.. రాజస్తాన్​ విక్టరీ

ధోనీ దోసౌ పార్టీ ఫెయిల్​.. రాజస్తాన్​ విక్టరీ
  • కెప్టెన్​గా మహీ 200వ మ్యాచ్‌‌లో ఓడిన చెన్నై
  • 3 రన్స్​ తేడాతో లాస్ట్ బాల్​కు రాజస్తాన్​ విక్టరీ
  • రాణించిన బట్లర్, అశ్విన్​
  • ధోనీ,జడ్డూ మెరుపులు వృధా

చెన్నై: ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​గా ఆడిన 200వ మ్యాచ్​లో మహేంద్ర సింగ్‌‌ ధోనీ (32 నాటౌట్‌‌) తన జట్టును గెలిపించలేకపోయాడు.ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడినా లాస్ట్‌‌ బాల్‌‌కు మరో సిక్స్​ కొట్టలేకపోయాడు. దీంతో బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్​ 3 రన్స్‌‌ తేడాతో సీఎస్కేపై నెగ్గింది. తొలుత రాజస్తాన్‌‌ 20 ఓవర్లలో 175/8 స్కోరు చేసింది. జోస్‌‌ బట్లర్‌‌ (36 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్స్‌‌లతో 52) హాఫ్‌‌ సెంచరీ చేయగా, దేవదత్‌‌ పడిక్కల్‌‌ (38), అశ్విన్‌‌ (30), హెట్‌‌మయర్‌‌ (30 నాటౌట్‌‌) తలా కొన్ని రన్స్‌‌ చేశారు. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో చెన్నై 20 ఓవర్లలో 172/6  స్కోరుకే పరిమితమైంది. డేవన్‌‌ కాన్వే (50) రాణించాడు. అశ్విన్​ (2/25), చహల్​ (2/27) చెరో రెండు వికెట్లు తీశారు. అశ్విన్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

ఆఖరి దాకా..

ఛేజింగ్‌‌లో సీఎస్కే ఇన్నింగ్స్‌‌ వేగంగా సాగలేదు. మూడోఓవర్‌‌లో రుతురాజ్‌‌ (8) ఔట్‌‌కాగా, డేవన్‌‌ కాన్వే, రహానె (31) కూడా నెమ్మదిగానే ఆడటంతో పవర్‌‌ప్లేలో 45/1 స్కోరే చేసింది. ఈ దశలో కాన్వే బ్యాట్‌‌ ఝుళిపించే ప్రయత్నం చేసినా, 10వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ (2/25), రహానెను ఔట్‌‌ చేయడంతో రెండో వికెట్‌‌కు 68 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి రాయల్స్‌‌ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో మ్యాచ్‌‌పై సీఎస్కే పట్టు కోల్పోయింది. దూబే (8),మొయిన్‌‌ అలీ (7), అంబటి రాయుడు (1), కాన్వే ఔటవడంతో  15 ఓవర్లకు 113/6తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో జడేజా (25 నాటౌట్‌‌), ధోనీ పోరాటం మొదలుపెట్టారు. 18వ ఓవర్లో మహీ 4, 6తో జట్టును రేసులోకి తెచ్చాడు.  టార్గెట్‌‌ 12 బాల్స్‌‌లో 40గా మారగా.. 19వ ఓవర్లో జడ్డూ 4, 6, 6తో 19 రన్స్‌‌ రాబట్టాడు. సందీప్​ శర్మ వేసిన లాస్ట్​ ఓవర్లో మహీ 6, 6 కొట్టినా 17 రన్సే రావడంతో చెన్నై కొద్దిలో విజయం చేజార్చుకుంది.  

ఆరంభం అదుర్స్‌‌..

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్​ రెండో ఓవర్లోనే యశస్వి జైస్వాల్‌‌ (10) వికెట్​ కోల్పోయినా బట్లర్‌‌, పడిక్కల్‌‌ మంచి పునాది వేశారు. ఉన్నంతసేపు ఈ ఇద్దరూ భారీ షాట్లతో వీరవిహారం చేశారు. మొయిన్‌‌ అలీ (1/21), తీక్షణ (0/42)ను టార్గెట్‌‌గా చేసుకుని ఫోర్లు, సిక్సర్లు బాదారు. దీంతో పవర్‌‌ప్లే ముగిసేసరికి రాయల్స్‌‌ 57/1 స్కోరుతో నిలిచింది. అలీ వేసిన 8వ ఓవర్లో బట్లర్‌‌ 6,6 కొట్టగా..  తర్వాతి ఓవర్‌‌లో జడేజా (2/21) మూడు బాల్స్‌‌ తేడాలో పడిక్కల్‌‌, సంజూ శాంసన్‌‌ (0)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. సగం ఓవర్లకు రాయల్స్‌‌ 95/3 స్కోరుతో మెరుగైన స్థితిలోనే ఉంది. ఈ దశలో బట్లర్‌‌కు తోడైన అశ్విన్‌‌ తొలుత స్లోగా ఆడినా ఆకాశ్‌‌ సింగ్‌‌ (2/40) వేసిన 15వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి లాస్ట్‌‌ బాల్‌‌కు ఔటయ్యాడు. ఆ వెంటనే బట్లర్‌‌ కూడా పెవిలియన్​ చేరగా...హెట్‌‌మయర్‌‌ జోరందుకున్నాడు. ధ్రువ్‌‌ జురెల్‌‌ (4) నెమ్మదిగా ఆడినా కరీబియన్‌‌ 6, 4, 6, 4 బాదాడు. ఆఖరి రెండు ఓవర్లలో జురెల్‌‌, హోల్డర్‌‌ (0), జంపా (1) ఔటైనా రాజస్తాన్‌‌ మంచి టార్గెట్‌‌నే నిర్దేశించింది.

సంక్షిప్త స్కోర్లు

రాజస్తాన్‌‌: 20 ఓవర్లలో 175/8 (బట్లర్‌‌ 52, దేశ్‌‌ పాండే 2/37), చెన్నై: 20 ఓవర్లలో 172/6 (కాన్వే 50, ధోనీ 32*, అశ్విన్‌‌ 2/25).