గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌కు రాజస్తాన్‌‌‌‌ చెక్‌‌‌‌...3 వికెట్ల తేడాతో విక్టరీ

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌కు రాజస్తాన్‌‌‌‌ చెక్‌‌‌‌...3 వికెట్ల తేడాతో విక్టరీ

అహ్మదాబాద్‌‌‌‌:  ఐపీఎల్‌‌‌‌–16లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను రాజస్తాన్​ రాయల్స్​ నిలబెట్టుకుంది. భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో షిమ్రన్‌‌‌‌ హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 56 నాటౌట్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ సంజూ శాంసన్‌‌‌‌ (32 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 60) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో రాయల్స్‌‌‌‌ 3 వికెట్ల తేడాతో గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన గుజరాత్‌‌‌‌ 20 ఓవర్లలో 177/7 స్కోరు చేసింది. డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ (30 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 46), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 45) రాణించారు.

స్టార్టింగ్‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ బౌలర్ల దెబ్బకు ఇన్నింగ్స్‌‌‌‌ మూడో బాల్‌‌‌‌కే సాహా (4) ఔటయ్యాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో సుదర్శన్‌‌‌‌ (20), హార్దిక్‌‌‌‌ పాండ్యా (28) ఉన్నంతసేపు వేగంగా ఆడారు. చివర్లో అభినవ్‌‌‌‌ మనోహర్‌‌‌‌ (27), మిల్లర్ జోరుతో గుజరాత్​ స్కోరు 170 దాటింది.  తర్వాత రాజస్తాన్‌‌‌‌ 19.2 ఓవర్లలో 179/7 స్కోరు చేసి నెగ్గింది. షమీ (3/25), హార్దిక్​ (1/24), రషీద్​ (2/46) దెబ్బకు యశస్వి (1), బట్లర్ (0), రియాన్​(5), పడిక్కల్​ (26) ఔటవడంతో 12 ఓవర్లకు రాయల్స్​ 66/4 మాత్రమే చేసింది. జట్టుకు ఓటమి తప్పదనుకున్న టైమ్​లో శాంసన్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌ చెలరేగి ఆడారు. వరుస గా ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయారు. 15వ ఓవర్లో శాంసన్​ ఔటైనా..ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (18), అశ్విన్‌‌‌‌ (10) సపోర్ట్​తో హెట్​మయర్ మరో నాలుగు బాల్స్​ మిగిలుండగానే రాజస్తాన్​ను గెలిపించాడు. అతనికే ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.