
అహ్మదాబాద్: ఐపీఎల్–16లో టాప్ ప్లేస్ను రాజస్తాన్ రాయల్స్ నిలబెట్టుకుంది. భారీ టార్గెట్ ఛేజింగ్లో షిమ్రన్ హెట్మయర్ (26 బాల్స్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 56 నాటౌట్), కెప్టెన్ సంజూ శాంసన్ (32 బాల్స్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 60) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాయల్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్కు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 177/7 స్కోరు చేసింది. డేవిడ్ మిల్లర్ (30 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46), శుభ్మన్ గిల్ (34 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 45) రాణించారు.
స్టార్టింగ్లో రాజస్తాన్ బౌలర్ల దెబ్బకు ఇన్నింగ్స్ మూడో బాల్కే సాహా (4) ఔటయ్యాడు. వన్డౌన్లో సుదర్శన్ (20), హార్దిక్ పాండ్యా (28) ఉన్నంతసేపు వేగంగా ఆడారు. చివర్లో అభినవ్ మనోహర్ (27), మిల్లర్ జోరుతో గుజరాత్ స్కోరు 170 దాటింది. తర్వాత రాజస్తాన్ 19.2 ఓవర్లలో 179/7 స్కోరు చేసి నెగ్గింది. షమీ (3/25), హార్దిక్ (1/24), రషీద్ (2/46) దెబ్బకు యశస్వి (1), బట్లర్ (0), రియాన్(5), పడిక్కల్ (26) ఔటవడంతో 12 ఓవర్లకు రాయల్స్ 66/4 మాత్రమే చేసింది. జట్టుకు ఓటమి తప్పదనుకున్న టైమ్లో శాంసన్, హెట్మయర్ చెలరేగి ఆడారు. వరుస గా ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయారు. 15వ ఓవర్లో శాంసన్ ఔటైనా..ధ్రువ్ జురెల్ (18), అశ్విన్ (10) సపోర్ట్తో హెట్మయర్ మరో నాలుగు బాల్స్ మిగిలుండగానే రాజస్తాన్ను గెలిపించాడు. అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.