హైదరాబాద్, వెలుగు : నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20వేల మందికి కుట్టు మిషన్లు అందజేస్తామని, మహిళలు ఆయా జిల్లాల మైనార్టీ వెల్ఫేర్ఆఫీసర్ కార్యాలయంలో గురువారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు 2 వేల కుట్టు మిషన్లు, ఇతర మైనారిటీలకు 18వేల కుట్టు మిషన్లు అందజేస్తామని వెల్లడించారు.