‘పార్టీ విజయం కోసం పని చేయాలి’ : రాజేశ్

‘పార్టీ విజయం కోసం పని చేయాలి’ : రాజేశ్

వనపర్తి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని కర్నాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి, స్థానిక జోనల్ ఇన్​చార్జి రాజేశ్  కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు ఎ రాజవర్ధన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఆఫీస్​లో జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తిలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ఇన్​చార్జిగా ఎమ్మెల్యే బసవరాజును నియమించిందని తెలిపారు. బి.కృష్ణ, బి.శ్రీశైలం, జ్యోతి రమణ, జింకల కృష్ణయ్య, కేతూరి బుడ్డన్న, ఆర్.వెంకటేశ్వర్ రెడ్డి, సీతారాములు, సుమిత్రమ్మ, పెద్దిరాజు, బాశెట్టి శీను, శివారెడ్డి, చెన్నయ్య, చిత్తారి ప్రభాకర్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కల్పన, అనుజ్ఞ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, మునివర్ధన్ సాగర్, గొర్ల బాబురావు, కొమ్ము సామెల్, బోయల రాము, డి ప్రవీణ్, బచ్చు రాము పాల్గొన్నారు.