ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నారు. తన ఇంటిలోనే అయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. రజనీ పక్కన ఆయన కుమార్తె సౌందర్య ఉన్నారు. దీనికి సంబంధించి సౌందర్య ట్విటర్ ద్వారా వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు.
రజనీ తన లేటెస్ట్ మూవీ 'అన్నాత్తే' షూటింగ్ ను ముగించుకుని హైదరాబాద్ నుంచి నిన్ననే ఆయన చెన్నైకి చేరుకున్నారు.