నెట్వర్క్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని జిల్లాకేంద్రాలు, పట్టణాల్లో ఆయన విగ్రహాలకు, ఫొటోల వద్ద కాంగ్రెస్ లీడర్లు, రాజీవ్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్గాంధీ అని కొనియాడారు.
