ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : షకీల్ అమేర్​

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం :  షకీల్ అమేర్​

బోధన్, వెలుగు : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షకీల్ అమేర్ ​చెప్పారు. శుక్రవారం బోధన్​ మండలంలోని పెంటక్యాంపు, ఖాజాపూర్, ఊట్​పల్లి, భూలక్ష్మిక్యాంప్, మావందికుర్దు, పత్తేపూర్ గ్రామాలలో పంచాయతీ భవనాలు, రాజీవ్​నగర్​తాండలో ఎస్పీ కమ్యూనిటీ హాల్,  సొసైటీ గోడౌన్​ను ప్రారంభించారు. ఏరాజ్​పల్లి, ఊట్​పల్లిలో పల్లె దవాఖానాలు ఓపెన్​ చేశారు. సాలూర గిద్దె చెరువులో చేపపిల్లలను వదిలిపెట్టారు. పెగడపల్లిలో పార్టీ ఆఫీస్​ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖజాపూర్​లో ముస్లింల శ్మాశనవాటిక కోసం హన్మంతు పటేల్​ విరాళంగా భూమి ఇవ్వడంతో అభినందించారు. బోధన్​ మండల ఎంపీపీ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ లక్ష్మి, డీసీసీబీ  డైరెక్టర్ ​గంగారెడ్డి, మాజీ రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ రాజేశ్వర్  పాల్గొన్నారు.