అగ్నిపథ్పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక భేటీ

అగ్నిపథ్పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్  కీలక భేటీ

అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు..నిరుద్యోగులు  నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకం చర్చించేందుకు ఢిల్లీలో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో   నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, అర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు త్రివిధ దళాధిపతులు రక్షణ శాఖ మంత్రి నివాసానికి చేరుకున్నారు.