రాకేష్ ఝున్ ఝున్వాలా.. ముంబై స్టాక్ మార్కెట్లో బిగ్బుల్!!
ఇప్పుడు ఆయన మరణం తర్వాత స్టాక్ మార్కెట్ వర్గాల దృష్టి ఒక అంశంపై పడింది.
అదేమిటంటే.. ఝున్ ఝున్వాలాకు చెందిన 4 బిలియన్ డాలర్ల స్టాక్స్!!
వీటిలో ఇకపై ఏం జరగబోతోంది ? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి ? అనే దానిపై స్టాక్ మార్కెట్ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.
ఐటీ, యానిమేషన్ నుంచి ‘ఆకాశ ఎయిర్’ వంటి విమానయాన సంస్థల దాకా ఎన్నో వ్యాపారాల్లో ఝున్ ఝున్వాలా దాదాపు రూ.31వేల కోట్ల (4 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టారు. వాటిలో ఆశాజనక స్థాయిలో లాభాలను ఆర్జించారు. చాలా స్టార్టప్ లకు స్వయంగా పెట్టుబడిని అందించడంతో పాటు ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు పొందే విషయంలో మంచి సలహాదారుగానూ రాకేశ్ వ్యవహరించేవారు. అందుకే అనేక భారతీయ కంపెనీల బోర్డులలో ఝున్ ఝున్ వాలా సభ్యుడిగా ఉండేవారు.
మార్కెట్ విలువ ప్రకారం .. ఝున్ ఝున్వాలాకు చెందిన టాప్ స్టాక్ హోల్డింగ్లలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, ఫుట్వేర్ మేకర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్, ఆటోమేకర్ టాటా మోటార్స్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. జున్జున్వాలా స్టార్ హెల్త్, ఐటి సంస్థ ఆప్టెక్ లిమిటెడ్, వీడియోగేమ్ మేకర్ నజారా టెక్నాలజీస్లో 10% కంటే ఎక్కువ వాటాలను కలిగి ఉన్నారు. ఈ వాటాల క్రయవిక్రయాలపై ఝున్ ఝున్ వాలా కుటుంబం, ఆయన ట్రేడింగ్ టీమ్ ఏ విధమైన వ్యూహాలను అనుసరిస్తుంది ? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
విజయవంతమైన పెట్టుబడి సూత్రాలకు చిరునామాగా మారిన ఝున్జున్వాలా ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన మార్కెట్ వాయిస్లలో ఒకరుగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న రిటైల్ పెట్టుబడిదారుల సమూహంలో ఆయనను గుడ్డిగా ఫాలో అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. RARE ఎంటర్ప్రైజెస్లో భాగస్వామి అయిన రాకేష్ ఝున్ఝున్వాలా 5.8 బిలియన్ డాలర్లు సంపాదించారు. భారతదేశపు అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడిదారుగా గుర్తింపు పొందారు. దీర్ఘకాల హోల్డింగ్ కోసం స్టాక్లను ఎంచుకునే పెట్టుబడిదారుగా మాత్రమే కాకుండా వ్యాపారిగా కూడా తెలివైనవాడు. యూఎస్ గ్రోత్పై వారెన్ బఫెట్ ఎలా నమ్మకముంచారో అలానే రాకేష్ జున్జున్ వాలా కూడా ఇండియా గ్రోత్ స్టోరీని ఎక్కువగా నమ్మారు. స్టాక్ మార్కెట్లు పడుతున్నా.. దేశం వృద్ధి బాట పడుతుందని, మార్కెట్ మళ్లీ లేస్తుందని ఎక్కువగా నమ్మేవారు. అందుకే ఆయనను ‘ఇండియన్ వారెన్ బఫెట్’ అని పిలిచేవారు.
ఝున్ ఝున్ వాలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెటర్గా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన నికర ఆస్థి విలువ రూ.5.5 బిలియన్లుగా ఉంది. 1986లో టాటా టీ షేర్లను కొనుగోలు ద్వారా తాను మొదటి సారి భారీ లాభాలను ఆర్జించారు. ఆయన టాటా టీ 5,000 షేర్లను కేవలం 43 రూపాయలకు కొన్నారు. తరువాత మూడు నెలల్లో ఆ స్టాక్ 143 రూపాయలకు పెరిగింది. దీంతో మూడు రెట్లు ఎక్కువ లాభం పొందారు. ఆ తర్వాత మూడేండ్లలో ఝున్ఝున్వాలా రూ.20 నుంచి రూ.25 లక్షలు సంపాదించారు. ఆయన్ని అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారునిగా బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ. 45 వేల కోట్లుగా ఉంది.