
వెలుగు, నెట్వర్క్: సిటీలో శనివారం రాఖీ పండుగ ఘనంగా జరిగింది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి దీవించారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వీహెచ్పీ, మాతృశక్తి, దుర్గావాహిని నాయకులు రాఖీ కట్టారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు కంటోన్మెంట్ఎమ్మెల్యే శ్రీగణేశ్కు బల్దియా కార్మికులు రాఖీ కట్టి ఆశీర్వదించారు.
నగర మేయర్ విజయలక్ష్మి పలువురు ముస్లింలకు రాఖీ కట్టి మత సామరస్యం చాటారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన యూసఫ్గూడలోని శిశు విహార్లో వేడుకలు చేసుకున్నారు. చిన్నారులకు రాఖీలు కట్టి, బహుమతులు అందజేశారు. గాంధీ దవాఖానలో డాక్టర్లు, సిబ్బందికి జనహిత సేవా ట్రస్ట్, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు రాఖీలు కట్టారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.