ప్రధాని ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

ప్రధాని ఇంట్లో  రక్షాబంధన్ వేడుకలు.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

న్యూఢిల్లీలోని తన నివాసంలో పిల్లలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. విద్యార్థినీలు మోడీకి రాఖీ కట్టారు.  కాసేపు  పిల్లలతో గడిపారు మోడీ.  ఓ చిన్నారి మోడీ చెంపపై ముద్దు పెట్టింది. పిల్లలు పద్యాలు , పాటలు కూడా పాడారు.  పిల్లల పేర్లు, క్లాస్ అడిగి తెలుసుకున్నారు మోడీ. స్కూల్ టీచర్లతో గ్రూప్ ఫోటో దిగారు మోడీ. ఈ వీడియో, ఫోటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. 

ఇటీవల చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం..  త్వరలో  సూర్యూడిపై ప్రయోగించే  ఆదిత్య L-1 మిషన్ గురించి  ప్రస్తావించారు.   ప్రజల  ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప‌థ‌కాల‌తో పాటు పలు  అంశాల‌పై ప‌ద్యాలు ర‌చించాల‌ని మోడీ ప్రోత్సహించారు. 

అంతకుముందు  మోదీ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోదరీ సోదరుల మధ్య విడదీయరాని విశ్వాసం,  ప్రేమకు అంకితమైన పవిత్రమైన రక్షాబంధన్ పండుగని అన్నారు.  భారతీయ సంస్కృతికి పవిత్ర ప్రతిబింబం రాఖీ పండుగ అని ట్వీట్ చేశారు.  ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆప్యాయత, సామరస్య భావాన్ని పెంపొందించాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.