రామ్ చరణ్తో 300 కోట్ల సినిమా.. కన్ఫర్మ్ చేసిన కార్తికేయ డైరెక్టర్

రామ్ చరణ్తో 300 కోట్ల సినిమా.. కన్ఫర్మ్ చేసిన కార్తికేయ డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ సినిమాను మొదలుపెట్టనున్నాడు. కార్తికేయ, కార్తికేయ2 సినిమాల డైరెక్ట్ చందు మొండేటి ఈ మూవీని తెరకెక్కించనున్నాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుందట.  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన డైరెక్టర్ చందు మొండేటి ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు.

“కార్తికేయ 2 రిలీజ్ కి ముందే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమాను ఒప్పుకున్నాను. కానీ కుదరలేదు. దాంతో కార్తికేయ 2 తీసాను. ఆ సినిమా రిలీజ్ తరువాత అరవింద్ గారు దగ్గరకి వచ్చి.. రామ్ చరణ్ అండ్ హృతిక్ లాంటి వాళ్ళతో మూవీ చేద్దాం అనుకుంటున్నాము. అటువంటి కథ ఏమన్నా నీ దగ్గర ఉందా? అని అడిగారు. అలాంటి కథ నా దగ్గర ఉండడం, అది అరవింద్ గారికి నచ్చడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది” అని చందు మొండేటీ తెలియజేశాడు. అంతేకాదు.. ఆ సినిమా రామ్ చరణ్ తో ఉండబోతుందని, దానికి దాదాపు 300 కోట్ల బడ్జెట్ అవుతుందన్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. 

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో శంకర్ తో గేమ్ ఛేంజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఆ తరువాత దర్శకుడు బుచ్చిబాబు సనాతో పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత  చందు మొండేటి సినిమా ఉంటుందని తెలుస్తోంది.