హైదరాబాద్: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. టాప్ డైరెక్టర్ శంకర్ తన కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో శంకర్ కాంబోలో భారీ మూవీ రాబోతోంది. ఈ సినిమాకు టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా తదుపరి మూవీని తెరకెక్కించనున్నట్లు శంకర్ ట్వీట్ చేశాడు. దిల్ రాజు సంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్కు ఈ సినిమా 50వ చిత్రంగా మైల్స్టోన్ ఫిల్మ్ కానుంది.
Excited to be a part of Shankar Sir's cinematic brilliance produced by Raju garu and Shirish garu.
Looking forward to #RC15 ! @shankarshanmugh @SVC_official #SVC50 pic.twitter.com/SpjOkqyAD4
— Ram Charan (@AlwaysRamCharan) February 12, 2021
‘ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. చరణ్, శంకర్ కలసి చేస్తున్న సినిమా భారీగా ఉంటుంది. వీరి కలయికలో వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు కూడా భారీగా ఉంటాయి. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ప్రేక్షకులకు నచ్చేలా నిర్మించనుంది. చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని దిల్ రాజు చెప్పారు.