
ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నారు మన స్టార్ హీరోలు. అయితే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో నలుగురు దర్శకులను మాత్రం లైన్లో పెట్టేస్తున్నారు. దాంతో నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందా అనే విషయంపై షూటింగ్ మొదలయ్యే వరకూ క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న రామ్ చరణ్, నెక్స్ట్ మూవీ విషయంలోనూ ఇదే కన్ఫ్యూజన్. తాజాగా మరో డైరెక్టర్కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా ‘బింబిసార’ చిత్రంతో హిట్ అందుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.
‘ఉప్పెన’తో మెప్పించిన బుచ్చిబాబు సానా కూడా ఓ స్టోరీ వినిపించినట్టు సమాచారం. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి.. చరణ్ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాను చరణ్ హోల్డ్లో పెట్టాడని టాక్. ఇక సుకుమార్ డైరెక్షన్లోనూ రామ్ చరణ్ నటించాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైమ్లోనే ఆ సినిమాకు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్స్ కూడా తీశారు. మొత్తానికి వీటిలో ఏది చరణ్ నెక్స్ట్ మూవీ అవుతుంది అని ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. త్వరలో శంకర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లనున్నాడు చరణ్. ఓ సాంగ్తో పాటు కొన్ని సీన్స్ అక్కడ తీయబోతున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.