
బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమ పెళ్లికి సంబందించిన ఫోటోలను కియారా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కియారా కోస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు సైతం ఇన్స్టా స్టోరీస్లో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపారు. వీరి పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందని చరణ్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఉపాసన కియారా దంపతులకు విషెస్ తెలియజేస్తూనే.. సారీ చెప్పడం వైరల్గా మారింది. ముందస్తు కమిట్మెంట్స్ కారణంగా వివాహానికి హాజరు కానందుకు కొత్త జంటకు క్షమాపణలు చెప్పింది. నిజానికి కియారాకు రామ్ చరణ్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. గతంలో చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కలిసి నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు RC15 చిత్రంలో మరోసారి చెర్రీ పక్కన జంటగా కనిపించనుంది. ఈ క్రమంలోనే చరణ్ సతీమణి ఉపసానతో కూడా ఆమెకు స్నేహబంధం ఉంది. అలాగే తన పెళ్లికి చరణ్, ఉపాసనలను ఆహ్వానించినట్లు తెలుస్తుండగా.. వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఉపాసన ఇలా సారీ చెప్పింది.
కొత్త జంట పెళ్లి ఫొటోలపై బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. ‘అభినందనలు.. చాలా అందంగా ఉన్నారు’ అంటూ కత్రినా కైఫ్, అలియా భట్ కామెంట్ చేయగా.. విక్కీ కౌశల్ అభినందనలు తెలిపారు. అలాగే సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్.. పార్టీ పాపర్, ఫ్లవర్ ఎమోజీలతో కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. తమ ఫేవరెట్ జోడీ ఒక్కటవ్వడం పట్ల అభిమానులు సైతం ఇద్దరిపై ప్రేమ కురిపిస్తున్నారు.