ఉప్పెన మూవీతో స్టార్ డైరక్టర్గా పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు సాన ఎట్టకేలకు తన రెండో మూవీని అనౌన్స్ చేశాడు. తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేయడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని బుచ్చిబాబు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. RC 16 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్, వెంకట సతీష్ కిలారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో ఈ మూవీ తెరకెక్కతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో ఓ మూవీ చేస్తున్నాడు. దీని తరువాత గౌతమ్ తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో ఆ ప్లేస్ లోకి బుచ్చిబాబు వచ్చి చేరాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశాలున్నాయి. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం చిత్రానికి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.