ఈ నెల 30న వస్తున్న రాజయోగం

ఈ నెల 30న వస్తున్న రాజయోగం

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా రామ్ గణపతి రూపొందించిన చిత్రం ‘రాజయోగం’. మణి లక్ష్మణ్ రావు నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ ‘‘ఇ ఈ’ (ఇతడు ఈమె) తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసే హీరో, తన ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానంలో నాలుగు రోజులు స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే.. అక్కడ ఓ అమ్మాయితో ఏర్పడ్డ పరిచయం ఎలాంటి మార్పులకు దారితీసింది. వాళ్ల లైఫ్ ఎలా టర్న్ అయిందనేది ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కించాం.  

వజ్రాల కోసం జరిగే వేట ఇది. అవి ఎవరికి దొరికాయి.. ఎవరికి ‘రాజయోగం’ పట్టిందనేది కథ. క్రైమ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీశాం. ఇంటర్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు వచ్చే ట్విస్టులు, టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సాయి రోనక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైటరే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ ఎలాంటి వల్గారిటీ లేకుండా ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీశాం. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అన్నాడు.