తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి.. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు అయ్యింది. అది కూడా రామచంద్రరావుదే. దీంతో అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర అధిష్టానం అధికారింగా ప్రకటించాల్సి ఉంది. ఎంపిక మాత్రం లాంఛనమే. ముందుగా అనుకున్నట్లే.. రామచంద్రరావు ఎంపికను డిసైడ్ చేయించి.. ఆ తర్వాత ఒకే ఒక్క నామినేషన్ దాఖలు అయ్యే విధంగా చూసింది పార్టీ. మధ్యలో మరో ఎమ్మెల్యే రాజాసింగ్ పోటీకి ప్రయత్నించినా.. ఆ తర్వాత ఆయన విరమించుకుని.. ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.

ALSO READ | టెర్రరిస్ట్‎లకు టార్గెట్ అయ్యా.. మీకో దండం.. మీ పార్టీకో దండం: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు పార్టీ హైకమాండ్ సోమవారం (జూన్ 30) నామినేషన్లు స్వీకరించింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎన్నిక ఇంచార్జులు నామినేషన్లు స్వీకరించారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ దాఖలకు గడువు ముగిసింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు ఒక్కరే అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నామినేషన్ దాఖలకు గడువు ముగిసే సమయానికి రామచందర్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికారక ప్రకటన ఒక్కటే ఉంది. ఎన్నిక షెడ్యూల్ ప్రకారం.. 2025, జూలై 1న రాష్ట్ర నూతన అధ్యక్షుడి పేరును పార్టీ అధిష్టానం ప్రకటించనుంది. బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ ఆఫీస్‎కు వచ్చారు. 

నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేయలేదు. పార్టీ హైకమాండ్ ముందుగానే రామచందర్‎ను తదుపరి పార్టీ చీఫ్‎గా ఎన్నిక చేయాలని డిసైడ్ కావడంతో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఇతర నేతలు ఎవరు నామినేషన్ వేయకుండా ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించారు. బీజేపీ అధ్యక్ష ఎన్నిక రేసులో మొదటి నుంచి ముందు వరుసలో ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ చివర్లో రేసు వైదొలిగారు. 

కేంద్ర నాయకత్వంతో రామచందర్ రావు వైపు మొగ్గు చూపడంతో వీరు అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో అధ్యక్ష పదవిపై పెట్టుకున్న వీరి ఆశలు అడియాశలు అయ్యాయి. మరోవైపు.. రామచందర్ ఎన్నిక పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రస్తుత తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసహనంతో పార్టీకి గుడ్ బై చెప్పారు.