సరోజినీ నాయుడు బయోపిక్ ఫస్టులుక్ రిలీజ్

సరోజినీ నాయుడు బయోపిక్ ఫస్టులుక్ రిలీజ్

చాలాకాలం క్రితం ప్రసారమైన రామానంద సాగర్ ‘రామాయణం’  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మళ్లీ ఇంతకాలానికి .. లాక్ డౌన్ సమయంలో పునః ప్రసారం చేస్తున్నారు. ‘సీత’ పాత్రలో ఒదిగిపోయిన దీపిక చిఖలియా…ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కన్పించనుంది. హిందీలో ‘సరోజినీ నాయుడు’ జీవిత చరిత్రగా రూపొందే ‘సరోజిని’ చిత్రంలో ఆమెకు టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ వచ్చింది. కాను భాయ్ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి,  ఆకాశ్ నాయక్, ధీరజ్ మిశ్రా దర్శకులు. లాక్ డౌన్ ను తొలగించిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ఇవాళ ఆ సినిమాకు సంబంధించి ‘సరోజినీ నాయుడు’ గా దీపిక చిఖలియా ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.