భూ సేకరణకు కో ఆర్డినేషన్ తో పని చేయండి : కలెక్టర్ శశాంక్

భూ సేకరణకు కో ఆర్డినేషన్ తో పని చేయండి : కలెక్టర్ శశాంక్

ఎల్​బీనగర్,వెలుగు : ఎన్ హెచ్ 65 రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి భూ సేకరణకు కో ఆర్డినేషన్ తో పని చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ సూచించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఎల్​బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు ఆరు లేన్ల రోడ్డు విస్తరణపై కు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్‌‌‌‌హెచ్ -65 పై  మహావీర్ హరిణ వనస్థలి పార్క్ (డీర్ పార్క్)

వద్ద  15/0 కి. మీ నుంచి 40/0 కి.మీ వరకు జరగాల్సిన హై వే  మరమ్మతుల సమస్యను పరిష్కరించడానికి భూమిని సేకరించాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా హై వే అండ్ బిల్డింగ్ ఈఈ ధర్మారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత రెడ్డి,  తహశీల్దార్లు, జిల్లా సర్వే లాండ్ ఏడీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.