డబ్బున్నోళ్లమ్మా : దుబాయ్ లో రూ.2.50 లక్షల చీర కట్టిన రష్మిక

డబ్బున్నోళ్లమ్మా : దుబాయ్ లో రూ.2.50 లక్షల చీర కట్టిన రష్మిక

పాన్ ఇండియా హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna) సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ విషయాలు, అప్ కమింగ్ సినిమాల విషయాలు ఆడియన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఈ బ్యూటీ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు రష్మిక. ఆ ఫొటోలో అందమైన చీరలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. దానికి   మీరందరూ కలిసి నాకు చీరలపై మరింత ఇష్టాన్ని పెంచేశారు.. అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. 

దీంతో రష్మిక ధరించిన ఈ చీర ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అర్పితా మెహతా డస్ట్ పింక్ చీర ధర దాదాపు రూ. 2.6 లక్షల వరకు ఉంటుందట. అవును మీరు చదివింది నిజమే. ఈ చీరకు ఉన్న  ప్రత్యేకత ఏంటంటే.. చీరపై చేసిన ఎంబ్రాయిడరీ పనిని కళాకారులు చేతితో చేశారట. అందుకే ఆ చీర అంత ఖరీదు అని తెలుస్తోంది. ఇక రష్మిక చీర ధర తెలుసుకున్న నెటిజన్స్  అవాక్కవుతున్నారు.

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ తో పుష్ప 2 మూవీ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో  పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.