Rashmika Mandanna: యాక్షన్ కాదు రొమాన్స్ కావాలి.. రూమర్స్పై స్పందించిన రష్మిక

Rashmika Mandanna: యాక్షన్ కాదు రొమాన్స్ కావాలి.. రూమర్స్పై స్పందించిన రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో సినిమాలో చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మిగతా భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఇటీవలే యానిమల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ..  ఆ సినిమాలో తన నటనకు గాను ఆడియన్స్ నుండి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.900 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక మందన్న గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఇటీవల ఆమె ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రష్మిక తన తరువాతి సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. తాను ఈ మధ్య అన్నీ యాక్షన్ సినిమాలే చేస్తున్నాని, రొమాంటిక్ సినిమా చేయాలని ఉందని, వాటి కోసం ఎదురుచూస్తున్నానని ఆమె అన్నట్టుగా ఆ న్యూస్లో ఉంది. 

ALSO READ :- Kalki 2898 AD: రొమాంటిక్ నేచర్లో ప్రభాస్, దిశా..ఫ్యాన్స్ కోసం భళే ప్లాన్ చేశారుగా

అయితే ఈ వార్తలు రష్మిక వద్దకు చేరడంతో.. వాటిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు రష్మిక. నేను ఎప్పుడు ఎవరితో అలా చెప్పలేదు.  ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాను. వాటిలో అన్నిరకాల సినిమాలు ఉన్నాయి. అంటూ తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది రష్మిక. దీంతో ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ తో పుష్ప 2లో నటిస్తున్న రష్మిక, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్నారు రష్మిక.