జడేజాకే ఎక్కువ డోప్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు

జడేజాకే ఎక్కువ డోప్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు

న్యూఢిల్లీ : ఇండియన్‌‌‌‌ క్రికెటర్లలో అందరికంటే ఎక్కువగా ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రవీంద్ర జడేజాకు డోప్ పరీక్షలు నిర్వహించారు. గత ఐదు నెలల కాలంలో అతని నుంచి మూడుసార్లు శాంపిల్స్‌‌‌‌ను సేకరించినట్లు నాడా (నేషనల్‌‌‌‌ యాంటీ డోపింగ్‌‌‌‌ ఏజెన్సీ) ప్రకటించింది. మెన్​, విమెన్​ క్రికెటర్ల నుంచి ర్యాండమ్​గా మొత్తం 58 శాంపిల్స్‌‌‌‌ సేకరించారు. 

ఇందులో సగానికి పైగా ఔటాఫ్‌‌‌‌ కాంపిటీషన్‌‌‌‌లో తీసినవే ఉన్నాయి. ఈ ఐదు నెలల కాలంలో టీమిండియా కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ, మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ నుంచి ఒక్క శాంపిల్‌‌‌‌ కూడా తీయలేదు.  ఏప్రిల్​లో హార్దిక్‌‌‌‌ పాండ్యా శాంపిల్‌‌‌‌ను సేకరించి పరీక్షించింది. అయితే ఒక్క క్రికెటర్​ కూడా డోప్​ టెస్టులో ఫెయిలవలేదు.