కాంగ్రెస్‌, బీజేపీలవి మోసపూరిత హామీలు: రవీంద్రకుమార్

కాంగ్రెస్‌, బీజేపీలవి మోసపూరిత హామీలు: రవీంద్రకుమార్

దేవరకొండ,  కొండమల్లేపల్లి, వెలుగు:  కాంగ్రెస్‌, బీజేపీలు అధికారంలో కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆరోపించారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌తో పాటు  కొండమల్లేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. బీఆర్‌‌ఎస్‌ పథకాలతో పాటు కాంగ్రెస్, బీజేపీ మోసాలను ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు.

 60 అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కేసీఆర్‌‌ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ అభివృద్ధి చెందిదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.