ఈసారి జీడీపీ ఫలితాలు బాగుంటాయ్: ఆర్బీఐ

ఈసారి జీడీపీ ఫలితాలు బాగుంటాయ్: ఆర్బీఐ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ​జీడీపీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ అన్నారు. గ్లోబల్​ మార్కెట్లలో సమస్యల వల్ల అన్ని దేశాలూ ఇబ్బందులు పడుతున్నాయని, వాటిని మనదేశం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్​ సెక్టార్​లో రాజీనామాల అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పెద్ద బ్యాంకుల్లో రాజీనామాలు 30 శాతం వరకు ఉంటున్నాయని దాస్​ అన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి  ప్రతి బ్యాంకు కోర్ ​టీమ్​ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈసారి మొదటి క్వార్టర్​లో మనదేశం 7.8 శాతం జీడీపీ సాధించింది. గత నాలుగు క్వార్టర్లలో ఇదే అత్యధికం.