
రాజస్థాన్ పై బెంగళూరు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 182 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ యశస్వీ జైశ్వాల్ 47 పరుగులు, దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ చేయగా..ధృవ జెరల్ 34 పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 182 పరుగులు మాత్రమే చేయగల్గింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లతో చెలరేగాడు. సిరాజ్ ,డేవిడ్ విల్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (74), డు ప్లెసిస్ (62) పరుగులతో రాణించారు. దీంతో బెంగళూరు జట్టు 200 ప్లస్ స్కోర్ ఈజీగా దాటేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరూ ఔటయ్యాక దినేశ్ కార్తిక్ (16), మహిపాల్ లోమ్రోర్ (8), హసరంగ (6)విఫలం కావడంతో ఆర్సీబీ 189 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో డకౌట్ అయి విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ చెరో రెండు వికెట్లు తీయగా, చాహల్,అశ్విన్ చెరో వికెట్ తీశారు.