15 కోట్ల బడ్జెట్ తో శంకర్ సినిమా పాట

15 కోట్ల బడ్జెట్ తో శంకర్ సినిమా పాట

డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే ఆ క్రేజ్ వేరు. భారతీయుడు, రోబో,  ఐ లాంటి సినిమాలతో హిట్ కొట్టి, డిఫరెంట్ స్టైల్ ని పరిచయం చేశాడు. శంకర్ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఆయన సినిమాల్లో డైరెక్ట్ చేసిన పాటలు మరో ఎత్తు. ప్రపంచంలో ఉండే అద్భుతమైన ప్రాతాల్ని ఆయన పాటల్లో కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. ఒక్క పాటకోసం ఎన్ని రోజులైనా వేచి చూస్తాడు. ఎంత దూరం అయినా వెళ్తాడు. 

అయితే, రామ్ చరణ్ హీరో, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘ఆర్ సి15’ (ఇంకా పేరు పెట్టలేదు)లో ఒక పాటను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పై తీస్తున్న ఈ చిత్రంలోని పాటను రూపాయలు 15 కోట్లు పెట్టి తీస్తున్నారు. 12 రోజుల పాటు న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఒక్క పాటను 15 కోట్ల బడ్జెత్ తీస్తున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ సినిమాలో ఎస్.జే. సూర్య, అంజలీ, జయరామ్, సునిల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, నాసర్, రఘుబాబు, సముద్రకని ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.