RCB vs PBKS : ఓపెనర్లు బాదేశారు.. పంజాబ్ కు భారీ టార్గెట్ 

RCB vs PBKS : ఓపెనర్లు బాదేశారు.. పంజాబ్ కు భారీ టార్గెట్ 

మొహాలి స్టేడియంలో జరుగుతోన్న పంజాబ్, బెంగళూరు మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బెంగళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ పంజాబ్ బౌలర్లను చితకొట్టారు. 16 ఓవర్ల వరకు క్రీజులో నిలబడి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59, 47 బంతుల్లో), డుప్లెసిస్ (84, 56 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 16 ఓవర్ వరకు వికెట్ పడకుండా క్రీజులో నిలబడ్డారు. దీంతో బెంగళూరుకు భారీ టార్గెట్ చేరుకోగలిగింది. ఓపెనర్లు మినహా.. ఏ బ్యాట్స్ మెన్ క్రీజులో నిలవలేకపోయారు.

మ్యాక్స్ వెల్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఫినిషర్ గా వచ్చిన దినేష్ కార్తిక్ (7, 5 బంతుల్లో) మరోసారి నిరాశ పరిచాడు. మహిపాల్ రామ్ రోర్ (7, 9బంతుల్లో), షబాజ్ అహ్మద్ (5, 3 బంతుల్లో) బ్యాటుతో ఆకట్టుకోలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ కు రెండు వికెట్లు దక్కాయి. అర్ష్ దీప్ సింగ్, నాథమ్ నిల్ చెరో వికెట్ తీసుకున్నారు.