
బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇరగదీసింది. బెంగళూరుకు 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఆది నుంచి చెలరేగింది. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడింది. కాన్వే 83, శివమ్ దూబే 52 రెచ్చిపోవడంతో చెన్నై భారీ స్కోర్ చేయగల్గింది. రహానే 37,మొయిన్ అలీ 19, రాయుడు 14 పరుగులతో రాణించారు.దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఐపీఎల్ లో చెన్నైకి ఇది మూడో అత్యధిక స్కోర్. 2008లో మొహలిలో పంజాబ్ పై 240/5, చేసింది. 2010లో రాజస్థాన్ పై 246/5 పరుగులు చేసింది.
బెంగళూరు బౌలర్లు వికెట్ల కోసం శ్రమించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, పార్నెల్, విజయ్ కుమార్, హసరంగ, హర్షల్ పటేల్, మాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.