
ముంబై: బ్యాంకులు అక్విజిషన్ ఫైనాన్సింగ్ చేసేందుకు ఆర్బీఐ అనుమతించడాన్ని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్వాగతించారు. ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఈ వ్యాపారాన్ని సులువుగా నిర్వహించగలవని అన్నారు. ఒక కంపెనీ మరొక కంపెనీని కొనడానికి లేదా దానిలో పెద్ద వాటాను తీసుకోవడానికి నిధులను సమకూర్చడాన్ని అక్విజిషన్ ఫైనాన్సింగ్ అంటారు.
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో శెట్టి మాట్లాడుతూ, విదేశీ సంస్థలను కొనుగోలు చేసే భారతీయ కార్పొరేట్లకు తాము లోన్లు ఇస్తున్నామని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే యూపీఐ క్రెడిట్ సొల్యూషన్తో లింక్ చేసి, వ్యవసాయ లోన్లు ఇవ్వడానికి కూడా ఎస్బీఐ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
త్వరలోనే యోనో యాప్ కొత్త వెర్షన్ తెస్తామని, మొదటి రోజే 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకునే సామర్థ్యం దీనికి ఉంటుందని శెట్టి చెప్పారు. కేవైసీ రూల్స్ను సులువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.