
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో మొబైల్ ఫోన్ల అమ్మకాలు భారీగా జరిగాయని అమెజాన్ ఎక్స్పీరియెన్స్ ఎరెనా రిపోర్ట్ పేర్కొంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో 5జీ స్మార్ట్ఫోన్లకు ఫుల్ డిమాండ్ కనిపించిందని, కిందటేడాది పండుగ సీజన్తో పోలిస్తే 60 శాతం పెరిగిందని తెలిపింది. రూ. 30 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్ 65 శాతం పెరిగాయంది.
హై ఎండ్ మొబైల్ ఫోన్ల వైపు యూజర్లు షిఫ్ట్ అవుతున్నారు. స్మార్ట్ఫోన్ సేల్స్లో చైనీస్ కంపెనీలు తమ హవా కొనసాగించాయి. ఈ ఏడాది పండుగ సీజన్లో రియల్మీ, షావోమి, ఒప్పో ఇండియా, వన్ప్లస్ బ్రాండ్లు పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిపాయి. ఈ ఏడాది పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వేరబుల్స్కు భారీగా డిమాండ్ కనిపించింది. ఫోల్డబుల్ ఫోన్లు ట్రెండింగ్ టాపిక్గా మారాయి.
శామ్సంగ్, మోటొరోలా, నొకియా, ఒప్పో వంటి కంపెనీలు తమ కస్టమర్ల కోసం ఫోల్డబుల్ ఫోన్లను తీసుకు రాగా, వీటి ధరలు రూ.3,500 నుంచి రూ.1,65,000 మధ్య ఉన్నాయి. కంపెనీలు ఆన్లైన్లో పెద్ద మొత్తంలో యాడ్స్ ఇచ్చాయి. టామ్ యాడ్ఎక్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, స్మార్ట్ఫోన్ల యాడ్స్ ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో ఆన్లైన్లో 320 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగాయి.
అదే రేడియోలో 174 శాతం, టీవీల్లో 79 శాతం పెరగగా, ప్రింట్ మీడియాలో 29 శాతం తగ్గాయి. షావోమీ టీవీ యాడ్స్ ఖర్చు కిందటేడాది పండుగ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 7,246 రెట్లు, రియల్మీ ఖర్చు 9.8 రెట్లు పెరిగింది. అదే రేడియో యాడ్స్లో యాపిల్ టాప్లో ఉంది. వన్ప్లస్ ప్రింట్ మీడియా యాడ్స్ కోసం ఎక్కువగా ఖర్చు చేసింది. ఆన్లైన్లో మాత్రం రియల్మీ ఎక్కువగా ఖర్చు చేసింది. ఈ కంపెనీ ఖర్చు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 2,694 శాతం
పెరిగింది.